తరగతి నాయకుడికి గమనిక
వంతెన రేఖాచిత్రాన్ని ఉపయోగించిన విద్యార్థులు, వారి సువార్త ప్రకటనలపై నివేదించండి.
Search through all lessons and sections in this course
Searching...
No results found
No matches for ""
Try different keywords or check your spelling
1 min read
by Stephen Gibson
వంతెన రేఖాచిత్రాన్ని ఉపయోగించిన విద్యార్థులు, వారి సువార్త ప్రకటనలపై నివేదించండి.
పౌలు రోమ్ పర్యటనకు ప్రణాళిక వేసుకున్నాడు. అతడు అక్కడ సువార్తను ప్రకటించాలని (రోమా 1:15), విశ్వాసులను బలోపేతం చేయాలని ఉద్దేశ్యముతో (రోమా 1:11-12), స్పెయిన్ మీదుగా ఒక మిషన్ యాత్రకు రోమా సంఘము యొక్క మద్దతు పొందాలని కోరుకున్నాడు (రోమా 15:24).
రోమీయులకు రాసిన లేఖనము యొక్క ఉద్దేశ్యం, పౌలు మరియు అతని రక్షణకు సంబంధించిన వేదాంత శాస్త్రాన్ని రోమా విశ్వాసులకు పరిచయం చేయడమే. ఈ లేఖనాలు రక్షణకు సంబంధించిన వేదాంతము వివరిస్తూ లోక వ్యాప్తంగా మిషనరీ పనిని వివరించింది.
పశ్చిమాన పురాతన రోమా కాలనీ మరియు ప్రపంచంలోని ఆ ప్రాంతంలో రోమా నాగరికతకు కేంద్రంగా ఉన్న స్పెయిన్ లోకి సువార్త యాత్ర ప్రయత్నాన్ని ప్రారంభించడానికి రోమ్ లోని సంఘాన్ని ఒక కేంద్రముగా ఉపయోగించాలని పౌలు ప్రణాళిక వేశాడు.
పౌలు రోమ్ పర్యటన అతడు అనుకున్న విధంగా జరగలేదు. అతన్ని యేరూసలెంలో అరెస్టు చేశారు. ఆయన తనకు న్యాయం జరగదని అనిపించింది, అతడు సీజరుకు విజ్ఞప్తి చేశాడు. ఒక ప్రమాదకరమైన ప్రయాణం తరువాత, ఓడ బ్రద్దలైపోయి, అతడు క్రీ.శ 60 లో ఖైదీగా రోమ్కు వచ్చాడు. అతడు నిర్బంధంలో ఉన్నప్పటికీ, అతడు సందర్శకులను స్వీకరించడానికి స్వేచ్ఛగా ఉన్నాడు; మరియు , ఆయన దగ్గరకు నగరమంతా చేరి రాగా వారికి పరిచర్య చేసాడు (అపొస్తలుల కార్యములు 28:30-31). ఈ సంఘటనలు, శ్రమలు "సువార్త యొక్క అభివృద్ధి" కొరకు పని చేస్తున్నాయని పౌలు చెప్పాడు (ఫిలిప్పీయులకు 1:12). సీజర్ ఇంటిలో కూడా కొందరు మారుమన్సు పొందారు. రెండేళ్ల తర్వాత ఆయన విడుదలయ్యారు. అతడు ఎప్పుడైనా స్పెయిన్ పర్యటన చేశాడా లేదా అనేది తెలియదు.
తన మిషనరీ యాత్రను ప్రారంభించటానికి సహాయం చేయమని పౌలు చేసిన అభ్యర్థనకు ప్రతిస్పందనగా సహజంగా అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. "మీరు ఎందుకు వెళ్ళాలి? " అని ఒకరు అడగవచ్చు. కాబట్టి , పౌలు సువార్త ప్రచారానికి తన అంకితభావాన్ని ప్రస్తావించడం ద్వారా లేఖనమును ప్రారంభించాడు (రోమా 1:1). తరువాత అన్యజనులకు అపొస్తలుడిగా తన ప్రత్యేక పిలుపు మరియు విజయాన్ని వివరించాడు (రోమా 15:15-20).
సాధ్యమయ్యే మరో ప్రశ్న ఏమిటంటే, "ప్రతి ఒక్కరూ సువార్తను ఎందుకు వినాలి? బహుశా ఈ సందేశం ప్రతిచోటా అవసరం లేదు." లోకవ్యాప్తంగా మానవాళికి సువార్త యొక్క సామర్థ్యాన్ని పౌలు వివరించాడు (రోమా 1:14-16, రోమా 10:12) మరియు మిషనరీ పని యొక్క అత్యవసరతను కూడా పౌలు వివరించాడు (రోమా 10:14-15). ఈ సందేశం ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి వర్తిస్తుందని మరియు ప్రతి వ్యక్తి దానిని వినవలసిన అవసరం ఉందని అతడు చూపించాడు.
మిషనరీ పనికి ఒక ఆధారాన్ని అందించే దాని అసలు ఉద్దేశ్యాన్ని ఈ లేఖనం ఇప్పటికీ అందిస్తుంది. ప్రతి ఒక్కరూ సువార్త సారాంశాన్ని ఎందుకు వినాలి అని పౌలు వివరించినట్లుగా, సందేశం ఏమిటో మరియు ప్రజలను ఈ విధంగా మాత్రమే ఎందుకు రక్షించవచ్చో వివరించాడు. కొన్ని సాధారణ అభ్యంతరాలపై ఆయన స్పందించారు. అతడు బోధించిన సందేశం యొక్క ఈ వివరణ మరియు రక్షణ పుస్తకంలో ఎక్కువ భాగం తీసుకుంటుంది మరియు దాని నిర్మాణాన్ని అందిస్తుంది.
రోమా లేఖనంలో మనకు ఉన్నది రక్షణకు సంబంధించిన వేదాంతశాస్త్రం యొక్క వివరణ. ఉపదేశంలో సమర్థించబడిన రక్షణకు పౌలు యొక్క వేదాంతశాస్త్రం యూదులకు వ్యతిరేకంగా తక్షణము రక్షణను అందించింది; మరియు అది soteriology, రక్షణ శాస్త్రము (రక్షణ యొక్క సిద్ధాంతాలను) లో సరైన ఆధునిక లోపాలు సరిచేస్తుంది.
విలియం టిండాలే, రోమా పుస్తకానికి తన ముందుమాటలో వ్రాస్తూ, "క్రీస్తు సువార్త యొక్క మొత్తం అభ్యాసాన్ని ఈ లేఖనంలో క్లుప్తంగా గ్రహించడం మరియు పాత నిబంధనలన్నింటికీ ఒక పరిచయాన్ని సిద్ధం చేయడం పౌలు మనస్సులో ఉంటుంది" అని అన్నారు.[1]
చరిత్రలో, అతి ముఖ్యమైన సత్యాలను మరచిపోయినప్పుడు వాటిని పునరుద్ధరించడానికి దేవుడు రోమా లేఖనంలోని ఉపదేశాన్ని ఉపయోగించాడు.
386 లో, అగస్టీన్ రోమా 13:13-14 చదివిన తరువాత తన పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి కట్టుబడిఉన్నాడు.
1515 లో, మార్టిన్ లూథర్ రోమా 1:17 యొక్క అర్ధాన్ని గ్రహించాడు. దేవుని తీర్పు నుండి తప్పించుకునేవాడు, విశ్వాసాన్ని కాపాడుకునేవాడు అని అతడు చూశాడు. అతడు చాలాకాలంగా కోరిన రక్షణకు నిశ్చయత ఇవ్వడానికి ఇది అతనికి ఆధారాన్ని ఇచ్చింది. విశ్వాసం మాత్రమే మనలను రక్షించగల మార్గం అనే అతని సందేశానికి ఇది ఆధారం అయ్యింది.
[2]1738 లో, జాన్ వెస్లీ చాల సంవత్సరాల నుంచి కోరుకున్న వ్యక్తిగత రక్షణకు నిశ్చయతను చెప్పాడు. అతడు క్రైస్తవ మతాన్ని ఎలా అనుసరించాలో అధ్యయనము చేయడానికి క్రమం తప్పకుండా గుమిగూడిన ఇతర యువకులతో సమావేశంలో ఉన్నప్పుడు ఇది జరిగింది. రోమా పుస్తకానికి లూథర్ ముందుమాటను ఎవరో చదువుతున్నప్పుడు, వెస్లీ తన హృదయాన్ని "వింతగా వేడెక్కినట్లు" భావించాడు. "నేను ఒంటరిగా క్రీస్తు, నా రక్షణకు క్రీస్తును మాత్రమే చాలు అని నమ్ముచున్నాను: మరియు అతడు నా పాపములను దూరంగా చేసుకున్నామని ఒక నిశ్చయత నాకు ఇవ్వబడింది మరియు పాపం మరియు మరణం ధర్మశాస్త్రము నుండి నాకు రక్షణ కలిగింది."[3] ఈ ముగ్గురికీ, రోమా లేఖన యొక్క సందేశాన్ని అర్థం చేసుకోవడం ఉత్సాహపూరితమైన సువార్త ప్రచారానికి ప్రేరణ కలిగింది. రక్షణకు సంబంధించిన వేదాంత శాస్త్రాన్ని వివరించడం ద్వారా మిషన్లకు ఒక ఆధారాన్ని అందించే ఉద్దేశ్యాన్ని ఈ పుస్తకం ఇప్పటికీ నెరవేరుస్తుంది.
మొత్తం రోమాలేఖన యొక్క వివరణ 1:16-18 లో ఉంటుంది.
1-14 వ వచనాలలో ఉన్న ప్రతిదీ 15 వ వచనంలోని ప్రకటనకు దారితీస్తుంది , అక్కడ పౌలు ఇలా అన్నాడు, “నేను సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను." వచనాలు 16-18 సంక్షిప్తంగా వివరించేందుకు సువార్త మరియు ఎందుకు అందరికి ఇది అవసరమో ఇది చెప్పబడినది. పాపులను విశ్వాసం ద్వారానీతిమతులుగా చేయబడుదురు అనేదే ఈ సందేశం. ప్రతి ఒక్కరికి ఈ సందేశం అవసరం, కారణం వారు దేవుని ఉగ్రత క్రింద ఉన్నారు.
రోమా లేఖన యొక్క ప్రాధమిక ఉద్దేశ్యాన్ని చెప్పడానికి మరొక మార్గం ఏమిటంటే, సువార్త యొక్క వివరణ, ఎవరైతే రక్షింపబడతారో మరియు ఎవరు నమ్మకపోయినా వారు ఖండించబడతారని దేవుని ఆజ్ఞ ఆధారంగా చెప్పబడినది.
రోమా లేఖన యొక్క క్లైమాక్స్ 10:13-15లో ఇలా వస్తుంది, ఇక్కడ సువార్త ప్రకటించువారు సువార్త తీసుకోవడం ఎందుకు అత్యవసరం అని పౌలు వివరించాడు. ప్రజలు నమ్మడం ద్వారా రక్షింపబడతారు, కాని వారు వినకపోతే వారు నమ్మలేరు.
ఈ లేఖనం యొక్క సాధారణ ఉద్దేశ్యం ఏమిటంటే, దేవుని శాశ్వతమైన, మార్చలేని ఉద్దేశ్యము లేదా ఆజ్ఞను ప్రచురించడం, అంటే, “నమ్మినవాడు రక్షింపబడతాడు: నమ్మనివాడు శిక్షించబడతాడు”
(జాన్ వెస్లీ).
రోమా పుస్తకం నుండి మాత్రమే వచనాలను ఉపయోగించి సువార్తను వివరించవచ్చు. సువార్త యొక్క ఈ ప్రకటనను కొన్నిసార్లు "రోమా రహదారి" అని పిలుస్తారు.
ప్రతి సూచనకు వివరణ యొక్క మొదటి వాక్యం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన వచనము.
రోమా 3:23
“అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.”
ప్రతి వ్యక్తి తప్పు అని తెలిసిన పనులు చేయడం ద్వారా పాపం చేసారు.
ఈ వచనం ప్రజలకు ఉన్న నిజమైన సమస్యను చూపిస్తుంది. వారు దేవునికి విధేయత చూపలేదు; వారు ఉద్దేశపూర్వకంగా దేవునికి అవిధేయత చూపారు. ఏ వ్యక్తి మినహాయింపు కాదు. ఎల్లప్పుడూ సరైనది చేసిన ప్రాతిపదికన ఏ వ్యక్తిని దేవుడు అంగీకరించలేడు.
ఈ అంశానికి మరింత ప్రాధాన్యత ఇవ్వడానికి, మీరు 3:10 (“నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు”) మరియు 5:12 (“మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను”) ఉపయోగించవచ్చు.
రోమా 6:23
“పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.”
పాపులు నిత్యమైన మరణాన్ని సంపాదించారు, కాని దేవుడు యేసు ద్వారా నిత్య జీవితాన్ని బహుమతిగా ఇస్తాడు.
పాపం ఎందుకు అంత తీవ్రమైనదిగా ఉందో ఈ వచనం చూపిస్తుంది. పాపం కారణంగా, మరణశిక్ష ప్రతి వ్యక్తికి ఇవ్వబడుతుంది. ఇది నిత్యమైన మరణం, ప్రతి పాపి దేవుని తీర్పుకు అర్హుడే.
మనం సంపాదించిన మరణానికి భిన్నంగా, దేవుడు మనం సంపాదించని జీవితాన్ని బహుమతిగా ఇస్తాడు.
రోమా 5:8
“దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.”
దేవుని బహుమతి మన కొరకు క్రీస్తు మరణం ద్వారా అందించబడింది.
మనకు అర్హమైన తీర్పును మనకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన మనలను ప్రేమించే, మనకు కృప ఇవ్వడానికి ఒక మార్గం సిద్దపరిచాడు. మనలను క్షమించబడటానికి యేసు బలిగా మరణించాడు. రక్షణకు అర్హమైనదిగా మనం ఏదైనా చేస్తామని దేవుడు వేచి ఉండలేదు - అది “మనం పాపులుగా ఉన్నప్పుడు” మనకు ఆయనే సిద్దపరిచాడు. రక్షణను మంచి వ్యక్తులకు కాదు, పాపులకు అనుగ్రహించబడినది.
రోమా 10:9
“మీరు ఒప్పుకుంటే... మరియు విశ్వసిస్తే... మీరు రక్షింపబడతారు.”
రక్షణకు ఉన్న ఏకైక అవసరం ఏమిటంటే, పాపి తాను పాపిని అని అంగీకరించడం మరియు యేసు మరణం మరియు పునరుత్థానం కారణంగా క్షమాపణ యొక్క దేవుని వాగ్దానాన్ని విశ్వసించడం.
పశ్చాత్తాపం గురించి ఏమిటి? ఒక వ్యక్తి తాను తప్పు చేశానని అంగీకరించి, క్షమించబడాలని కోరుకుంటే, అతడు తన పాపాలను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని సూచిస్తుంది.
రోమా 10:13
“ప్రభువు నామమును బట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును.”
రక్షణ ప్రతి వ్యక్తికి సంబందించినది. ఎవరికి మినహాయింపులేదు. ఇతర అర్హతలు లేవు.
రోమా 5:1
“విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.”
దేవుని వాగ్దానాన్ని నమ్మడం ద్వారా మనలను దేవుని స్నేహితునిగా చేస్తుంది, ఇకపై దోషులుగా పరిగణించబడము.
దేవునితో సమాధానము కలిగి మనము ఇకపై ఆయనకు శత్రువులుగా ఉండము; మనము సమాధాన పడ్డాము. మనలను దేవుని నుండి వేరు చేసిన పాపం మార్గం నుండి ప్రత్యేకించబడితిమి. నీతిమంతులుగా చేయబడుట అంటే దోషిగా పరిగణించబడకపోవుట. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా చేయబడుట అంటే, మన క్షమాపణకు అవసరమని దేవుని వాగ్దానాన్ని విశ్వసించడం.
రోమా 8:1
“కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.”
మనము క్రీస్తుతో అనుసంధానించబడినందున, మనం చేసిన పాపాలకు ఇకపై ఖండించబడము.
క్రీస్తు పాపము చేయని జీవితాన్ని గడిపాడు మరియు ఆయన సిలువలో మరణించి న్యాయం యొక్క అవసరాన్ని నెరవేర్చాడు. విశ్వాసం ద్వారా మనం ఆయనతో గుర్తించబడితిమి మరియు తండ్రి అయిన దేవుడు మనలను అంగీకరించాడు. మనం ఎన్నడూ పాపం చేయనట్లు దేవుడు మనలను చూస్తాడు.
ముగింపు
దేవుడిని ప్రార్థించడం, తాను పాపిని అని ఒప్పుకోవడం మరియు యేసు బలి మరణం మరియు పునరుత్థానం ఆధారంగా క్షమాపణ కోరడం ద్వారా పాపిని రక్షించబడవచ్చు అనే సత్యమును వివరించు.
ఈ పద్ధతిని నేర్చుకోవడానికి మరియు ఆచరించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, రోమా లేఖనలో ఉపయోగించాల్సిన ప్రతి వాక్యాన్ని మొదట గుర్తించు లేదా ఆ వచనము క్రింద గీత గీయడము ద్వారా గుర్తించడం. దాని ఉపయోగం యొక్క క్రమాన్ని చూపించే ప్రతి దాని పక్కన ఒక సంఖ్యను ఉంచండి. ఉదాహరణకు: మొదట ఉపయోగించాల్సిన వచనం పక్కన, సంఖ్య 1 అని వ్రాయండి.
సువార్త ప్రకటించుటను సాధన చేయండి. ప్రతి వచనం చదివిడానికి సరియైన వివరణ ఇవ్వండి. ప్రతి వచనం తరువాత మొదటి వాక్యంలో ఉన్న భావనలను చేర్చాలని నిర్ధారించుకోండి. ఏ వివరణ అవసరమో, ఇతర వాక్యాలు ఉపయోగకరంగా ఉంటే వాటిని ఉపయోగించండి. ఈ పాఠంలో అందించబడిన ఖచ్చితమైన పదాలను అలాగే ఉపయోగించడం అవసరం లేదు.
బైబిల్ తప్ప మరేమీ చూడకుండా మీరు దీన్ని వచ్చే వరకు సాధన చేయండి.
తరగతి నాయకుడికి గమనిక: ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు సమూహము కొరకు రోమా రహదారి వాడకాన్ని ప్రదర్శించాలి. ప్రకటనను మెరుగుపరచగల మార్గాలను సమూహంతో చర్చించాలి. అప్పుడు, విద్యార్థులు సాధన కొరకు జతలుగా విభజించాలి. ప్రతి విద్యార్థి వేర్వేరు శ్రోతలకు రెండుసార్లు ప్రకటన చేయాలి.
(1) రోమా రహదారిని ఉపయోగించి, కనీసం ముగ్గురికి సువార్త ప్రకటించండి. ప్రతి సంభాషణ గురించి ఒక పేరా వ్రాయండి మరియు మీరు తదుపరి తరగతి సెషన్కు వచ్చినప్పుడు దాని గురించి చెప్పడానికి సిద్ధంగా ఉండండి.
(2) రోమా రహదారి యొక్క లేఖనలోని రిఫరెన్స్లను (మీ బైబిల్ను మాత్రమే ఉపయోగించి) జ్ఞాపకశక్తి నుండి వ్రాయడానికి సిద్ధంగా ఉండండి మరియు తరువాత తరగతి సెషన్ ప్రారంభంలో ప్రతి ఒక్కరికీ కనీసం ఒక వాక్య వివరణ ఇవ్వండి.
(3) తదుపరి పాఠం సువార్త బోధ గురించి. ఈ పాఠం కొరకు, మీరు బోధించిన సువార్త సందేశము యొక్క అవలోకనము లేదా సారాంశాన్ని వ్రాయండి, మీరు విన్నది లేదా మీరు అభివృద్ధి చేయాలనుకుంటున్నది. తదుపరి తరగతి సెషన్కు మీతో తీసుకురండి.
ముద్రించగల PDF ఇక్కడ అందుబాటులో ఉంది.
రోమా రహదారి సువార్త ప్రకటనలో ఉపయోగించిన లేఖనాల కొరకు సూచనలు వ్రాయండి. సూచన క్రింద వివరణ యొక్క కనీసం ఒక వాక్యాన్ని వ్రాయండి. వచనాలను వ్రాయవద్దు.
(1) రోమా ______
(2) రోమా ______
(3) రోమా ______
(4) రోమా ______
(5) రోమా ______
(6) రోమా ______
(7) రోమా ______
SGC exists to equip rising Christian leaders around the world by providing free, high-quality theological resources. We gladly grant permission for you to print and distribute our courses under these simple guidelines:
All materials remain the copyrighted property of Shepherds Global Classroom. We simply ask that you honor the integrity of the content and mission.
Questions? Reach out to us anytime at info@shepherdsglobal.org
Total
$21.99By submitting your contact info, you agree to receive occasional email updates about this ministry.
Download audio files for offline listening
No audio files are available for this course yet.
Check back soon or visit our audio courses page.
Share this free course with others